ఈమె జయలలిత కూతురేనట..! పైగా సోగ్గాడికి కూడానట..నిజమేనా


అమృత ..జయలలిత కూతుర్నంటూ సుప్రీంకోర్టుకి పిటీషన్ వేయడం..కోర్టు అసలు హైకోర్టులో కాకుండా ఇక్కడకెందుకు వచ్చారని మందలించడం తెలిసిందే కదా..! ఏదైనా మనకి సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి..అందరికీ తెలిసిన వ్యక్తులకు వారసులు ఉండాలని  రావాలని కోరుకుంటాం..సినిమావాళ్ల విషయంలో ఇంకా ఆసక్తి ఎక్కువ మనకి.అందుకే కథలో ట్విస్టులు ఉఁటేనే నచ్చుతుంది..అందుకే అమృతని చూసినవాళ్లంతా అచ్చంగా జయలలితలానే ఉందే అనుకోవడం సహజం..పైగా డిఎన్ఏ టెస్టుకి కూడా  రెడీ అంటుందాయె
ఈ వీడియో చూడండి



అమృత చెప్పినదాని ప్రకారం ఆమె తండ్రి కూడా తెలిసిన వ్యక్తే.ఓరకంగా ఇప్పటికీ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు..యాక్టివ్‌గా కూడాఉన్నారు..శోభన్ బాబు మనవడి పెళ్లికికూడా ఆహ్వానాలు అందుకుని మరీ కుటుంబంతో దగ్గరగా మెలిగేంత అభిమానగణం ఇప్పటికీ ఉన్నారాయనకు. వీళ్లిద్దరికీ తాను పుట్టానని..1990ల్లో జయలలిత కుటుంబానికి మళ్లీ దగ్గరైతే బాగా ఆదరించారని కూడా చెప్తోంది..

 అది బానే ఉంది..ఇప్పుడు కొత్తగా గీత అనే ఆవిడ( జయలలిత స్నేహితురాలిగా ఆమే చెప్పుకుంటోంది...మీడియా కూడాఅలానే ప్రచారం చేస్తోేంది) శోభన్ బాబు 1999 ప్రాంతంలో తమకో కూతురున్నట్లు చెప్పినట్లు అఁటోందామె.. ఇది నిజమో కాదో చెప్పడానికి అటు శోభన్ లేడు..ఇటు జయలలిత లేరు..ఐనా కథలో బోలెడంత సస్పెన్స్ఉంది..ఇక నిజంగా డిఎన్ఏ టెస్టులకు ఓకే అయితే..ఏం జరుగుతోంది

ఒకటి జయ ఆస్తులకు వారసులు...రెండోది పార్టీకి వారసులు..ఇవి రెండూ అయితే ఒకఎత్తు..అసలు ట్విస్ట్ వచ్చినావిడ అమృత..శోభన్ బాబు ఆస్తుల్లో వాటా అడిగితే కరుణాశేష్ ఊరుకుంటాడా...అసలీ పరిణామాలపై ఎప్పుడూ వారి కుటుంబసభ్యులను మీడియా అడిగిందీ లేదు..వాళ్లు చెప్పిందీ లేదు...ఐతే ఒకటి చనిపోయినవారి ప్రవేట ్ జీవితాలపై ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ బాధ కలిగించేదే..కానీ తప్పదు కదా...

 శోభన్ బాబుతోనే జయలలితకి ఎందుకు ముడిపెడతారంటే...ఆయన రాసిన నేనూ నా కథానాయికలూ అనే  ఓ ధారావాహికకి ఆయనే స్వయంగా అందరు హీరోయిన్ల ఇళ్లకి వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకొచ్చేవారు..ఆ సందర్భంలోవారి  చేసిన వంట తినడం ఇంట్లో కొన్ని ఫోటోలు దిీగడం కూడా ఉఁడేవి..ఇప్పటి డైన్ విత్ ఏ స్టార్, డే విత్ ే స్టార్ ప్రోగ్రామ్ లాగా..అందులో భాగంగానే జయలలితఇంట్లో ఆమె వంట చేసి పెడుతోన్న ఫోటోలు కూడా ఉన్నాయ్..ఇప్పుడు వాటినే మీడియా తెగ వాడేస్తుంటుంది..ఐతే ఓల్డ్ రైటర్ కే.రామలక్ష్మి ఈ మధ్యనే వీళ్లిద్దరి మధ్యా నడిచిన లవ్ గురించి చెప్పింది కాబట్టి...నిజంగానే శోభన్-జయల మధ్య లవ్ ఉందనుకోవాలి..ఐతే అది పిల్లలు పుట్టేవరకూ వెళ్లిందా అన్నదే ప్రశ్న..పైగా శోభన్ బాబు హీరోగా జయలలిత హీరోయిన్‌గా ఓ సినిమా మొదలుకాకుండానే శోభన్ ని తీసేశారు..అందుకు కారణం జయ మదర్ వేదవల్లి ఉరఫ్ సంధ్య..ఈమె పేరు అందరికీతెలుసు కానీ..ఆమె నటిగాకూడా మనందరికీ తెలుసు..కానీ ఆమే..ఈమే ఒకరే అని మాత్రం తక్కువ మందికే తెలుసు..మాయాబజార్ లో ఎన్టీఆర్ కి జోీడీగా చేసిన సంధ్యే జయలలిత మదర్..ఆమే శోభన్ బాబు చిన్న హీరో పక్కన ఎందుకు చేయడం అని పట్టుబట్టి మరీ ఆ సినిమా నుంచి శేోభన్ ని తప్పించేలా చేసిందట..అలాంటిది శోభన్ తో అఫైర్ పెట్టుకోకుండా చేయడం పెద్ద పని కాదు..కానీ ఆమె చనిపోయిన తర్వాతే శోభన్ బాబు జయలలిత ఒంటరితనాన్ని పోగెట్టేలా సెట్‌లో జుోకులు వేసేవారని చెప్పేవాళ్లు..
 ఐతే  అంత మాత్రాన ఇప్పుడు వచ్చిన అమృత నిజంగానే జయలలిత కూతురా..లేక ఇమేజ్ డ్యామేజ్ చేయించేందుకు ప్రత్యర్ధి పార్టీలు పన్నిన కుట్రా అనేది తెలీదు..ఎలాగైతేనేం తమిళ మీడియాతో పాటు మన మీడియాకి కూడా ఓ మసాలా వార్త దొరికింది..చాలు..





Comments