పవన్ కల్యాణ్ గురించి గత వ్యాసంలోనే మాట్లాడుకున్నాం..ఎంతసేపటికీ అవతలివాళ్లపై రాళ్లు వేయడమే తప్ప
తనపై కూడా రాళ్లు పడితే ఎలా ఉంటుందో తెలియదు అతనికి..పైగా అతని ఫ్యాన్స్ సంగతి చూస్తే..అసలు ఓ కామెంట్ చేయడమే తప్పు అన్నట్లు ఉన్మాదంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షనేతే డైరక్ట్ కౌంటర్ ఇచ్చేసరికి ముద్ద గొంతులోంచి బైటికి వచ్చినట్లైంది కాకపోతే ఇప్పుడు జగన్ నలుగురు పెళ్లాలు అనేసరికి కాదు కాదు మా బాస్ కి ఉన్నది ముగ్గురే..అసలు వాళ్లకి విడాకులు ఇచ్చారు ఇలా రకరకాలుగా జగన్పై దాడి జరుగుతోంది.
వీడియో లింక్ ఉంది క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=8h0BTI6RubM
పవన్ కల్యాణ్ గురించిన ప్రస్తావన తెచ్చిన విలేకర్లకు జవాబులు ఇస్తూ..అసలు పవన్ కల్యాణ్ కి విలువలు లేవు..విలువలు లేని వ్యక్తి కూడా నాపై విమర్శలు చేస్తాడా అంటూ నోరు జారిన జగన్ ఇలా భార్యల ప్రస్తావన తెచ్చాడు దీంతో పవన్ కల్యాణ్పై ఈ స్థాయి నాయకుడెవరూ ఈ మధ్యకాలంలో ఇలాంటి కామెంట్లు, విమర్శలు చేయలేదు. ఐతే 2009 ఎన్నికలకు ముందు మాత్రం కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ పవన్ కల్యాణ్ పై ఘాటుగానే
కామెంట్లు చేశారు. ముందు నందినికి న్యాయం చేయ్..తర్వాత దేశానికి చేద్దువు అని గట్టిగా కౌంటర్ ఇచ్చాడాయన అప్పట్లో..దాని తర్వాత రాష్ట్రస్థాయి నేత ఒకరు ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి. దీంతో పవన్ కల్యాణ్కి గట్టి ఝలక్కే పడ్డట్టైంది
ఇప్పుడు ఇక జగన్ వంతు..ముందూ వెనకా చూడకుండా నలుగురు పెళ్లాలు అనే మాట వాడటం ఆయన పొరపాటు. కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే పవన్ కి ఉన్న వ్యవహారాలేవో జగన్కి తెలిసే ఇలా కామెంట్ చేశాడని..ఏదైతేనేం తప్పు మాట్లాడినందుకు జగన్ కూడా బానే విమర్శలు ఎదుర్కొంటున్నాడు
Comments
Post a Comment