అల్లు అర్జున్ తమ ఫ్యాన్స్ కోసం చేసిన ఓ ట్వీట్ కలకలం రేపింది. ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టండి మీకంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది. ఈసారి కొట్టామంటే అన్ని బద్దలు అయిపోవాలి...ప్రస్తుతానికి అన్నీ మర్చిపోయి హ్యాపిగా ఉండండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
విషయం ఏమిటంటే మనోడు నటించిన నా పేరు సూర్య ఈ మద్య భారీ పండ పడేసింది. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లుగా సినిమా ఏదో అవుతుందనుకుంటే జనం ఏదో చేసి తిప్పి కొట్టారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాపం బాగా డిజప్పాయింట్ అయ్యారు.
సినిమా వచ్చి రెండు నెలలు దాటుతున్నా చడీ చప్పుడు లేదు. ఆ మధ్యలో మనం అనే సినిమా తీసిన విక్రమ్ కుమార్ డైరక్షన్లో సినిమా చేస్తామని ప్రకటించారు..కానీ అదేం మొదలయ్యేలా లేదు..దీంతో ఫ్యాన్స్లో టెన్షన్ పెరిగిపోయింది. అందుకోసమే తాజాగా ట్వీట్ ఛేసాడు అర్జున్. ఐతే ఈ సమయంలోనే అటు పవన్ కల్యాణ్ జగన్ పై కామెంట్లు చేయడం దాన్ని జగన్ ..పవన్ వివాహాలతో ముడిపెట్టి కౌంటర్ ఇవ్వడంతో వేడి రగిలింది. ఈ టైమ్లో ఫ్యాన్స్కి ఓపిక పట్టండి అంటూ ట్వీట్ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్లోకి ఇతగాడు కూడా ఎంటర్ అయ్యాడేంటా అనుకున్నారు..కానీ ట్వీట్ అంతా చదవడంతో ఓ ఇదంతా సినిమాకి సంబంధించిన వ్యవహారమా అనుకుంటూ కూలయ్యారు.
Comments
Post a Comment