ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనితీరు సమర్ధవంతంగా ఉండాలే కానీ
వాటిపై ఇన్వెస్టర్లు మంచిఆదరణ చూపెడతారనే అంశానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్
స్టాక్ నిదర్శనంగా మారింది. ఈ స్టాక్ ఈ రోజు లక్ష కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ దాటింది
అఫ్కోర్స్ దీనికి..ఈ సంస్థలో ఇతర బ్యాంకుల విలీనం కూడా ఓ కారకం కావచ్చు కానీ
పిఎస్యు బ్యాంకులలో ఇంతకంటే పెద్దవి కూడా సాధించలేని ఘనత మాత్రం దక్కించుకుంది
ఇంట్రాడేలో ఈ బ్యాంక్ స్టాక్ రూ.91.81కి చేరిన తరుణంలో లక్ష..వేయి కోట్ల మార్కెట్
కేపిటలైజేషన్ సాధించింది.
ఇప్పటిదాకా లక్ష కోట్లు దాటిన మార్కెట్ కేపిటలైజేష్ సాధించిన బ్యాంకుల్లో
ఎస్బీఐ, బ్యాంక్ ఆప్ బరోడా మాత్రమే ఈ రికార్డ్ దక్కించుకోగా..ఇది మూడో ప్రభుత్వరంగ బ్యాంక్
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి PNB షేర్లు రూ. 90.05 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments
Post a Comment