దుమ్మురేపిన లాభం, ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ ఐపిఓ కేక పుట్టించింది
ఈ ఐపిఓ ఈ రోజు 87శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇష్యూ అలాట్మెంట్ రేటు
రూ.142కాగా, రూ.265 రేటుతో ట్రేడ్ ప్రారంభించింది. తర్వాత రూ.274.50కి కూడా పెరిగింది
గురుగ్రామ్ బేస్డ్ ఈవీ ఛార్జర్ మేకింగ్ కంపెనీగా సుపరిచితమైన ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ ఐపిఓతో
రూ.492కోట్లను సేకరించింది. ఈ ఇష్యూకి ఏకంగా 129 రెట్లుఎక్కువగా బిడ్లు వచ్చాయ్. రిటైల్ కేటగరీలో
119 రెట్లు ఎక్కువ బిడ్లు రాగా..దానికి తగినట్లుగానే లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయ్
ఈవీ ఛార్జర్లు, హౌసింగ్,రెసిడెన్షియల్ బిల్డింగ్ ఛార్జింగ్ సర్వీస్ ప్రొడక్ట్స్ , డిజిటల్ ఇన్ఫ్రా ప్రొవైడర్గా
ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ వ్యాపారం చేస్తోంది
స్టోరీ పబ్లిశ్ అయ్యే టైమ్కి ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ షేర్లు రూ. 247.15 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment