ఇక్కడ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఫ్రీ..


ఒడిశాలోని భువనేశ్వర్‌లో భాగ్జి కరుణాశ్రయ పాలియేటివ్ కేర్ సెంటర్‌లో

క్యాన్సర్ వ్యాధికి ఉచితంగా చికిత్స చేస్తుంటారు. ఈ విషయాన్ని మాజీ ఐపిఎస్

అరుణ్ బోత్రా తన ట్విట్టర్ అక్కౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని మహీంద్రా అండ్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా కంటపడటమే తరువాయి..దాన్ని వైరల్ చేశారు



సుబ్రతో, సుస్మిత అనే ఈ కేంద్రం నిర్వాహకులకు అభినందనలు తెలపడమే కాకుండా

ఈ సెంటర్ గురించి అందరికీ తెలియజేయండంటూ ట్వీట్ చేశారు. 


చివరి రోజుల్లో ఉన్నవారికి ఇన్ పేషెంట్ సర్వీసులను ఉచితంగా అందించే ఇలాంటి సెంటరే ఒకటి

బెంగళూరులో కూడా ఉఁదని నెటిజన్ ఒకరు గుర్తు చేయగా..ఇలాంటి సెంటర్లనుఏర్పాటు చేస్తున్నవారు

ధన్యులంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు

Comments