మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనే కోరిక చాలామందికి బలీయంగా ఉంటుంది.కానీ ఈక్విటీల జోరులో దాన్ని పక్కనబెట్టేస్తుంటారు..ఐతేఇప్పుడు మరో అట్రాక్టివ్ పద్దతిని సెబీ తీసుకువచ్చే ఆలోచన చేస్తోంది .ఈమేరకు సెబీ ఛైర్మన్ మదాబీ పూరీ బూచ్ ఓ ప్రకటన చేసారు. ఓ ఫైనాన్షియల్ మేగజైన్ నిర్వహించిన వేదికపై ఆమె ఇలా చెప్పారు. చిన్న మొత్తాల్లో సిప్స్ చేయడం, ఈక్విటీ మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్లకు కూడా పరిపుష్టిని చేకూర్చుతాయంటూ చెప్పుకొచ్చారామె
ఫండ్ హౌస్లతో రూ.250కే సిప్ తీసుకురావడానికి మాట్లాడుతున్నట్లు ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు బూచ్ చెప్పారు.
ఈ 240 సిప్ అనేది..ఓ షాంపూ...ఓ శారీకిఅయ్యే ఖర్చుగా పోల్చారు..నిజమే ఇంత తక్కువగా సిప్ చేయగలిగితే మంచిదే
మరి ఫండ్ మేనేజర్లు..ఫండ్ హౌసులు పెట్టే ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉండొచ్చుకాబట్టి..ఈ 250 రూపాయల సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ బహుశా..లాంగ్ టర్మ్ టైమ్ హారిజాన్ ఉండే అవకాశంకన్పిస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్ 8 నాటికి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వేల్యూ 49లక్షలకోట్ల రూపాయలకిపైబడి ఉంది..చిన్నమొత్తాల్లో సిప్ తీసుకురాగలిగితే..అది ఇంకా పెట్టుబడులను ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు
Comments
Post a Comment