మార్కెట్లు 21వేల మార్క్ అధిగమించాయ్..మరిప్పుడు కరెక్షన్ వస్తుందనే మాట 80శాతం మంది చెప్తున్నారు
నిజంగా అలా జరగదనేవాళ్లూ ఉన్నారు..వారు చెప్తున్న కారణాలు ఏమిటంటే
1. అధికార మార్పిడి కేంద్రంలో జరగదు..దానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం.
2. ర్యాలీకిఇంకా చాలా దారులు ఉన్నాయి..లెగ్స ఆఫ్ ర్యాలీ ఇంకా విస్త్రతంగా ఉంది
రాబోయే డిసెంబర్ క్వార్టర్ సీజన్ ఇంకా దద్దరిల్లుతుంది కాబట్టి..ఈ ఫలితాలు మార్కెట్లకు మరింత ఇంధనమనేది వారి అంచనా
3. మార్కెట్లు అనుకున్నంతగా పెరగలేదు..మరీ ఖరీదెక్కువగా షేర్లు లేవు అని అంటారు
రివర్స్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోని చూడమంటారు. ప్రస్తుత షేరు ధర, ప్రాఫిట్ గ్రోత్ని పోల్చి చూసినప్పుడు మీకా విషయం
తెలుస్తుందంటారు కొందరు
4. ఫారిన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులను దశాబ్దం క్రితంనాటి స్థాయిలో ఉన్నారిప్పుడు.., కాబట్టి
వాళ్లు కనుక తిరిగి పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే..ఇంకా పెరగవచ్చు
పైన చెప్పినవన్నీ అంచనాలే, బుల్ మార్కెట్ ర్యాలీకి అవకాశం ఇంకా ఉందనే నమ్మకానికి ఊతంగా వస్తోన్న వాదనలు
ప్రపంచంలో ఎప్పుడేమైనా జరగవచ్చు కాబట్టి..దేనికీ గ్యారంటీలేదని గమనించగలరు
Comments
Post a Comment